కాంగ్రెస్‌ది దాటవేత ధోరణి : వినోద్‌

న్యూఢిల్లీ : పార్లమెంటరీ ప్రజస్వామ్యం బతకాలంటే రాజకీయ పార్టీలు బాధ్య తాయుతంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని తెరాస నేత వినోద్‌ అన్నారు. తెలంగాణపై ఏదీ చెప్పకుండా కాంగ్రెస్‌ దాటవేత ధోరణి అవలంభిస్తోందని ఆయన విమర్శించారు. ఈ అఖిలపక్ష సమావేశంలో కాంగ్రెస్‌ స్పష్టత ఇవ్వకుండా రేపట్నుంచి తెలంగాణ గ్రామాల్లో ఆ పార్టీ జెండా ఎగరనివ్వమని హెచ్చరించారు.