కాంగ్రెస్‌లో చేరిన హిమాచల్‌ బిజెపి నేత

న్యూఢిల్లీ,ఏప్రిల్‌22(జ‌నంసాక్షి): హిమాచల్‌ ప్రదేశ్‌ బీజేపీ సీనియర్‌ నేత, హమిర్‌పూర్‌ మాజీ ఎంపీ సురేశ్‌ చందేల్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ సమక్షంలో ఆయన పార్టీలో చేరారు. ఈ సందర్భంగా సురేశ్‌తో పాటు హిమాచల్‌ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ చీఫ్‌ కుల్దీప్‌ రాథోడ్‌, హిమాచల్‌ ప్రదేశ్‌ ఏఐసీసీ ఇంచార్జ్‌ రజనీపాటిల్‌ తదితులు ఉన్నారు. కాగా కాంగ్రెస్‌ పార్టీలో చేరక ముందు సురేశ్‌ బీజేపీ రైతు విభాగం ‘కిసాన్‌ మోర్చా’ జాతీయ అధ్యక్షుడుగా ఉన్నారు. హవిూర్‌పూర్‌ నియోజకవర్గం నుంచి పార్లమెంటుకు ప్రాతినిధ్యం వహించిన ఆయన.. 1998 నుంచి వరుసగా మూడు సార్లు ఇక్కడ విజయం సాధించారు.