కాంగ్రెస్‌ అభిప్రాయం ఎందుకు చెప్పలేకపోతోంది? : రేవంత్‌రెడ్డి

న్యూఢిల్లీ: తెలంగాణపై అధికార కాంగ్రెస్‌ పార్టీ ఎందుకు అభిప్రాయం చెప్పలేకపోతోందని తెదేపా నేత రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. తెలంగాణపై అఖిలపక్ష భేటీ జరుగుతున్న నేపథ్యంలో ఆయన కేంద్ర హోంశాఖ కార్యాలయానికి వచ్చారు. తెలంగాణ సమస్యకు శాశ్వత పరిష్కారం కనుగోనాలని పార్టీ తరపున పట్టుబడుతామని తెలిపారు. షిండే అవగాహన కోసమే ఈ భేటీ ఏర్పాటు చేశారన్నదానిపై ఆయన మండిపడ్డారు. రాష్ట్ర గవర్నర్‌గా పనిచేసిన షిండేకు సమస్యపై అవగాహన లేదను కుంటే పొరపాటేనని వ్యాఖ్యానించారు.