కాంగ్రెస్‌ నేత రాజ్‌బబ్బర్‌ వివాదాస్పద వ్యాఖ్యలు

రూపాయి విలువను మోదీ తల్లి హీరాబెన్‌తో పోలిక

ఇండోర్‌,నవంబర్‌23(జ‌నంసాక్షి): కాంగ్రెస్‌ నేత, ఉత్తర్‌ప్రదేశ్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాజ్‌ బబ్బర్‌ ఎన్నికల వేళ సంచలన వ్యాఖ్యలు చేశారు. రోజురోజుకు పడిపోతున్న రూపాయి విలువను భారత ప్రధాని నరేంద్రమోదీ తల్లి హీరాబెన్‌ వయస్సుతో పోల్చి వివాదం సృష్టించాడు. డాలర్‌తో భారత రూపాయి విలువ మాజీ ప్రధాన మంత్రి మన్మోహన్‌సింగ్‌ వయస్సుకు చేరిందని మోదీ పోల్చుతూ ఉండేవారు. ఇవాళ, రూపాయి విలువ గణనీయంగా పడిపోయింది. ఇప్పుడు దాని విలువ ఆయన మాతృమూర్తి వయస్సుకు దగ్గరల్లో ఉందని మధ్యప్రదేశ్‌ ఎన్నికల ర్యాలీలో భాగంగా ఇండోర్‌లో బబ్బర్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం మోదీ తల్లి హీరాబెన్‌ వయసు 97ఏళ్లు. బబ్బర్‌ వివాదాస్పద వ్యాఖ్యలపై బీజేపీ నేతలు మండిపడుతున్నారు. తక్షణమే క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేస్తున్నారు. కాంగ్రెస్‌ నేతలు దిగజారి మాట్లాడుతున్నారని విమర్శిస్తున్నారు. అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ భారీగా పతనమవుతున్న సంగతి

తెలిసిందే.