కాంగ్రెస్‌ పార్టీ బాధితుల పక్షాన నిలుస్తుంది: రాహాల్‌గాంధీ

రాయ్‌పూర్‌: కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ ఛత్తీస్‌గాఢ్‌ రాజధాని రాయపూర్‌ చేరుకున్నారు. అక్కడ ఆయన మావోయిస్టుల దాడిలో గాయపడి చికిత్స పొందుతున్నవారిని పరామర్శించారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌ పార్టీ బాధితుల పక్షాన నిలుస్తుందని ఆయన హామీ ఇచ్చారు. కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ప్రధాని మన్మోహన్‌ రాయ్‌పూర్‌ వచ్చి బాధితులను పరామర్శించనున్నట్లు సమాచారం.