కాంగ్రెస్‌ ప్రభుత్వం వల్లే శాసనసభ, స్థానికసంస్థల నిర్వీర్యం

సీపీఎం రాష్ట్ర కార్యదర్శి రాఘవులు

విజయవాడ : కాంగ్రెస్‌ ప్రభుత్వం శాసనసభను, స్థానిక సంస్థలను నిర్వీర్యం చేసిందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి బీవీ రాఘవులు ఆరోపించారు. ఈరోజు ఆయన విజయవాడలో విలేకరులతో మాట్లాడారు. పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించాలని త్వరలో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేయనున్నట్లు రాఘవులు తెలిపారు.