కాంట్రిబ్యూటరీ పెన్షన్‌ విధానాన్ని రద్దు చేయాలి

వరంగల్‌,ఆగస్ట్‌3(జ‌నం సాక్షి): కేంద్ర ప్రభుత్వం వెంటనే కాంట్రిబ్యూటరీ పెన్షన్‌ విధానాన్ని రద్దు చేసి పాత విధానాన్ని పునరుద్దరించాలని ఉపాధ్యా సంఘాల నేతలు డిమాండ్‌ చేశారు. ఉద్యోగుల ఆదాయ పన్ను పరిమితిని 5 లక్షలకు పెంచాలని కోరుతుంటే పెడచెవిన పెడుతుందన్నారు.కేంద్రం అఖిలభారత స్థాయిలో ఉద్యోగులతో చర్చలు నిర్వహించి పలు డిమాండ్లను నెరవేరుస్తామని హామి ఇచ్చినా నేటికి కూడా అమలు చేయలేదన్నారు. ఇప్పటికి కూడా కేంద్రంలో మార్పు రాకపోతే మాత్రం పోరాటాలు మరింత ఉదృతంచేస్తామని ఆయన హెచ్చరించారు.