కాటేపల్లిలో అఖండ హరినామా సప్తాహా ప్రారంభం

జుక్కల్, పిబ్రవరి 15, (జనంసాక్షి),
కామారెడ్డి జిల్లా పెద్ద కొడప్ గల్ మండలం కాటేపల్లి గ్రామంలో బుధవారం అఖండ హరినామా సాప్తాహా ప్రారంభమైంది. సప్తహా అధ్యక్షులు విఠల్ మహారాజ్ ముదిరాజ్ కాస్లా బాద్ అధ్వర్యంలో భజన మండలి సభ్యులు పాండురంగ విటలేశ్వరుడికి పూజలు జరిపారు. భజన మండలి సభ్యులకు, భక్తులకు కంకణం కట్టారు.ఈ సంధర్భంగా సప్తా అధ్యక్షులు మాట్లాడుతు ఈ కార్యక్రమం ఈనెల 22వ తేది వరకు కొనసాగుతుందని తెలిపారు. గ్రామస్తు లందరు ప్రతిరోజు ఇళ్లు వాకిళ్ళు శుభ్రపరిచి భక్తి శ్రద్ధలతో సప్తాలో పాల్గొనాలని కోరారు.