కాపుసభకు అనుమతి లేదు

కాకినాడ,జనవరి28(జ‌నంసాక్షి): కాపు జాక్‌ ఎవరూ ఇప్పటి వరకు సభకు అనుమతి అడగలేదని పెద్దాపురం ఎస్‌పి స్పష్టం చేశారు. సోమవారం ఉదయం పెద్దాపురంలో జిల్లా ఎస్‌పి విశాల్‌ గున్ని విూడియా సమావేశం నిర్వహించారు. ఎస్‌పి మాట్లాడుతూ.. కాపు జాక్‌ కి ఎవరూ ఇప్పటి వరకు సభకు అనుమతి అడగలేదని, అనుమతి అడిగితే పరిశీలిస్తామని తెలిపారు. ఎలాంటి బహిరంగ సభ నిర్వహించాలన్నా అనుమతి తప్పనిసరి అని స్పష్టం చేశారు. అనుమతి లేని సభలకు ఎవరూ హాజరు కాకూడదని చెప్పారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్‌పి విశాల్‌ గున్ని హెచ్చరించారు.