కాశ్మీర్ ఎన్కౌంటర్లో నలుగురు ఉగ్రవాదుల హతం
శ్రీనగర్,నవంబర్20(జనంసాక్షి): జమ్మూకాశ్మీర్ షోపియాన్ జిల్లాలో ఎన్కౌంటర్ జరిగింది. నదిగామ్లో ఓ భవనంలో నక్కిన ఉగ్రవాదులను భద్రతా బలగాలు చుట్టుముట్టాయి. భద్రతా బలగాల కాల్పుల్లో నలుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. ముష్కరుల దాడిలో జవాను వీరమరణం పొందగా.. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఉగ్రవాదులు, భద్రతా బలగాల మధ్య ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. మరో వైపు పాకిస్థాన్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. పూంఛ్ సెక్టార్లో పాక్ మూడు షెల్స్ విసిరింది. పూంఛ్లోని బ్రిగేడ్ ప్రధాన కార్యాలయానికి సవిూపంలో ఘటన చోటు చేసుకుంది.