కుంభకోణాల నిలయంయూపీఏ-2 పాలన: రాజ్‌నాథ్‌ సింగ్‌

న్యూఢిల్లీ, జనంసాక్షి: యూపీఏ-2 పాలన కుంభకోణాలకు నిలయంగా మారిందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు రాజ్‌నాత్‌ సింగ్‌ మండిపడ్డారు. అవినీతి నిర్మూలించడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని ధ్వజమెత్తారు. ఎవరిని రక్షించడానికి అశ్వనీకుమార్‌ రాజీనామా చేశరని ప్రశ్నించారు. పాలనలో వైఫల్యాలు వెలుగు చూస్తున్నా ప్రధాని ఎందుకు మెదపడం లేదని అడిగారు. కేంద్ర ప్రభుత్వం కుంభకోణాల మయంగా మారి ప్రజల విశ్వాసాన్ని కోల్పోయింది అని ఆయన అన్నారు.