కుప్పకూలిన విమానం; 41 మంది మృతి

9

జుబా: దక్షిణసూడాన్లో కార్గో విమానం కుప్ప కూలిన ఘటనలో కనీసం 41 మంది మరణించారు. బుధవారం దక్షిణ సూడాన్ రాజధాని జుబా విమానాశ్రయం నుంచి అపర్ నైల్ స్టేట్లోని పాలోచ్కు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

జుబా విమానాశ్రం నుంచి విమానం టేకాఫ్ తీసుకున్న తర్వాత కేవలం 800 మీటర్ల దూరంలో ఓ చిన్న ద్వీపంలో కూలిపోయింది. విమానంలో ప్రయాణిస్తున్న 20 మందితో పాటు విమానం కుప్పకూలిన ప్రాంతంలో నివసిస్తున్న మరో 21 మంది మరణించారు. ప్రమాద స్థలంలో 41 మృతదేహాలను గుర్తించినట్టు ఓ పోలీస్ అధికారితో పాటు స్థానికులు చెప్పారు. విమాన ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సివుంది. ఈ కార్గో విమానాన్ని రష్యాలో తయారు చేశారు.