కుమారై సీటు కోసం రుణానిధి పాట్లు

చెన్నై : డీఎంకే అధినేత కరుణానిధి కుమారై కనిమొళికి రాజ్యసభ సీటు కోసం కాంగ్రెస్‌ సాయం తీసుకునేందుకు సిద్ధమైనట్లు సమాచారం. కనిమొళి రాజ్యసభ సభ్యత్వం వచ్చేనెలతో ముగియనుంది. అమెను తిరిగి ఎన్నికయ్యేలా చూడడానికి డీఎంకేకి తగిన బలం లేదు. దాంతో మిత్రపక్షాల మద్దతు కోసం దృష్టి సారిస్తున్నారు కరుణానిధి. తమిళనాడులో జూన్‌ 27న రాజ్యసభ ఎన్నికలు జరగనున్నాయి.