కులవృత్తులకు ప్రాధాన్యం: ఎమ్మెల్యే ఎర్రబెల్లి 

జనగామ,మే28(జ‌నం సాక్షి): కులవృత్తులకు ప్రాధాన్యత ఇవ్వాలన్నాదే సీఎం కెసిఆర్‌ లక్ష్యమని పాలకుర్తి ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. వివిధ కార్యక్రమాలను ఆయన పరిశీలించారు. గత పాలకుల హయాంలో పల్లెల్లో కులవృత్తులు అంతరించిపోయాయని మండిపడ్డారు. కాంగ్రెస్‌ పాలనలో కులవృత్తులను పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. గోదావరి జలాలతో చెరువులను నింపడమే ధ్యేయంగా పనిచేస్తున్నామన్నారు. 200 కోట్లతో కాల్వ పనులు పూర్తిచేయిస్తున్నామన్నారు. 60కోట్లతో నెల్లుట్ల నుంచి నాంచారి మడూరు డబుల్‌ రోడ్డు, దర్దేపల్లి నుంచి అన్నారం డబుల్‌ రోడ్డు పనులు మంజూరు చేశానన్నారు. వావిలాలలో గల్లిగల్లీకి సీసీ రోడ్లు నిర్మిస్తానని హావిూ ఇచ్చారు.  సీఎం కేసీఆర్‌ పాలనలోనే కులవృత్తులు జీవం పోసుకుంటున్నాయని పేర్కొన్నారు.సీఎం కేసీఆర్‌ చేపడుతున్న అభివృద్ధి పనులు ప్రజాసంక్షేమ పథకాలు ప్రతి పక్షాలకు కనిపించడం లేదని అన్నారు.  రాజకీయాలకతీతంగా సీఎం కేసీఆర్‌కు మద్దతు తెలపాల్సింది పోయి విమర్శలు చేయడం సిగ్గు చేటన్నారు.