కూలిన జెట్ విమానం: పైలెట్ మృతి

rs4tnptpలావోస్ : నైజీరియాలోని ఈశాన్య అడమావ రాష్ట్ర రాజధాని యెలాలో ఎయిర్ ఫోర్స్కి చెందిన జెట్ విమానం శనివారం కూలింది. ఈ ప్రమాదంలో పైలెట్ మరణించాడని ఎయిర్ ఫోర్స్ ఉన్నతాధికారులు ఆదివారం వెల్లడించారు. వాతావరణం అనుకూలించకే ఈ ప్రమాదం జరిగిందని తెలిపారు.అంతేకాని ఎటువంటి తీవ్రవాద చర్యలు కాదని వారు స్పష్టం చేశారు. ఈ ఘటన అనుకోకుండా జరిగిందన్నారు. అయినా ఈ ఘటనపై విచారణకు ఆదేశించామన్నారు. నైజీరియాలో నెలకొన్న అంతరుద్ధ్యం కారణంగా గత ఆరేళ్లుగా బోకో హరామ్ తీవ్రవాదులు దాడులు పలు రాష్ట్రాల్లో విధ్వంసం చేస్తున్న సంగతి తెలిసిందే.