కూలిన మిగ్`21 యుద్ధ విమానం
జైపూర్,(జనంసాక్షి): మరో మిగ్`21 యుద్ధ విమానం నేల కూలింది. రాజస్థాన్ రాష్ట్రంలోని బార్మేర్ జిల్లాలో అకాశంలో ఎగురుతూ ఈ యుధ్ద విమానం కుప్పకూలింది. అయితే ఈ ప్రమాదం నుంచి పైలట్ సురక్షితంగా బయటపడ్డారు. వైమానిక దళాధికారులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు.