కృష్ణా రివర్‌ బోర్డుకు మరోమారు తెలంగాణ లేఖ

అక్రమ నీటి తరలింపును ఆపాలని వినతి
హైదరాబాద్‌,అగస్టు12(జనం సాక్షి): కృష్ణా రివర్‌ మేనేజ్‌మెంట్‌ బోర్డుకు తెలంగాణ సర్కార్‌ మరోసారి లేఖ రాసింది. సరైన కేటాయింపులు లేకుండా శ్రీశైలం ప్రాజెక్ట్‌ ముందు భాగం నుంచి.. అక్రమంగా కేసీ కెనాల్‌కు ఏపీ నీటిని మళ్లించకుండా చూడాలని విజ్ఞప్తి చేసింది. అనుమతి లేని ప్రాజెక్టుల ద్వారా తరలింపును అడ్డుకోవాలని ఈఎన్‌సీ మురళీధర్‌ తెలిపారు. ముచ్చుమర్రి ఎత్తిపోతల నుంచి నీటి తరలింపు ఆపాలన్నారు. మాల్యాల పంపింగ్‌ స్టేషన్‌ నుంచి నీటి తరలింపు ఆపాలన్నారు. బనకచర్ల రెగ్యులేటర్‌ నుంచి నీటి తరలింపు ఆపాలని ఈఎన్‌సీ మురళీధర్‌ కోరారు. ఈ మేరకు ఆయన లేఖ రాశారు. పంపుల ద్వారా నీటిని ఎత్తిపోసే ప్రక్రియను ఆపాలన్నారు.