కెనడా నౌక ముంపు ఘటన..ఐదుగురు మృతి

టోఫినో: కెనడాలో పడబ ముంపునకు గురైన ఘటనలో ఐదుగురు మృతి చెందినట్టు బ్రిటీష్ కొలంబియా కోరోనర్స్ సర్వీస్ అధికారులు వెల్లడించారు. తిమింగలాలను చూసేందుకు యాత్రికులను తీసుకెళ్లిన నౌక వాంకోవర్ ఐలాండ్‌లో ముంపునకు గురైన సంగతి తెలిసిందే. గాలింపును ముమ్మరం చేసి 21 మందిని కాపాడారు. మృతుల్లో ఇద్దరు స్వీడన్‌కు చెందినవారు కాగా మిగతా వారు కొలంబియా, ఇంగ్లాండ్, జాక్ స్లాటర్ ప్రాంతాలకు చెందిన వారని అధికారులు తెలిపారు.