*కెవిపిఎస్ ఆధ్వర్యంలో సంక్షేమ హాస్టల్ లో సర్వే*
*గోపాల్ పేట్ జనం సాక్షి సెప్టెంబర్ (16):* గోపాల్ పేట్ మండల కేంద్రంలో ని ఎస్సీ హాస్టల్లో కెవిపిఎస్ ఆధ్వర్యంలో విద్యార్థు ల సమస్యలపై సర్వే నిర్వహించారు కెవిపిఎస్ జిల్లా అధ్యక్షులు గంధం భగత్ మాట్లాడుతూ పెరుగుతున్న ధరలకు అనుగుణంగా సంక్షేమ హాస్టల్లో మెస్ ఛార్జీలు పెంచి, పెండింగ్ లో ఉన్న కాస్మోటిక్ బిల్లులను వెంటనే విద్యార్థులకు అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు అదేవిధంగా సంక్షేమ హాస్టల్ విద్యార్థులకు బట్టలు, చెప్పులు, ప్లేట్లు, గ్లాసులు, బెడ్లు, ఇవ్వకపోవడం అన్యాయం అని ప్రభుత్వం వెంటనే విద్యార్థులకు అవసరమైన సామాగ్రిని ఇవ్వాలన్నారు జిల్లాల్లో భోజనం మెనూ సక్రమంగా పాటించాలని,సంక్షేమ హాస్టల్లో వసతులు కొరబడుతున్నాయని వాటిని సరి చేసే బాధ్యత జిల్లా అధికార యంత్రం తీసుకోవాలన్నారు కెవిపిఎస్ ఆధ్వర్యంలో జిల్లాల్లో ఉన్న అన్ని సంక్షేమ హాస్టల్లో సర్వే చేసి సమస్యల పరిష్కారానికి జిల్లా అధికారులకు వినతి పత్రాలు అందజేస్తూ ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో కెవిపిఎస్ జిల్లా నాయకులు సుధాకర్, వడ్డేమాన్ రాజు, రాము, మరియు హాస్టల్ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు