కెసిఆర్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించిన బిఆర్ఎస్ నాయకులు

..కెసిఆర్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించిన బిఆర్ఎస్ నాయకులు..
ధర్మపురి (జనం సాక్షి )రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆదేశాల మేరకు ధర్మపురి మండలంలో వివిధ గ్రామాల భారత రాష్ట్ర సమితి అధ్యక్షులు, సర్పంచులు,ఎంపీటీసీలు ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ధర్మపురి కూరగాయల మార్కెట్ ఆవరణంలో పిఎసిఎస్ చైర్మన్ అయ్యోరి రాజేష్, జైన గ్రామం లో  గ్రామ శాఖ అధ్యక్షుడు గాండ్ల రమేష్,తిమ్మాపూర్ గ్రామం లో ప్రాథమిక పాఠశాల,హై స్కూల్ లో పండ్ల పంపిణీ చేసి ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం లో సర్పంచ్ కాళ్ల శేఖర్,ఎంపీటీసీ కాళ్ల సత్తయ్య, పిఎసిఎస్ చైర్మన్ సాయిని సత్యనారాయణ,రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు కస్తూరి నాగభూషణం,సీనియర్ నాయకులు బొమ్మ కంటి గంగారాం, వావిలా ప్రకాష్,ఎస్ఎంసి చైర్మన్ ముతుర్ల శ్రీనివాస్,వార్డ్ మెంబర్ కాళ్ల దివాకర్,ఉపాధ్యాయులు, విద్యార్థులు మరియు గ్రామ ప్రజలు పాల్గొని ముఖ్యమంత్రి కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.