కేంద్రమంత్రికి ఘన సన్మానం

 

 

 

 

 

 

 

మండల పరిధిలోని జానారెడ్డి నగర్ లో గల కట్కూరి గన్నారెడ్డి నివాసంలో కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి మహేంద్ర నాథ్ పాండే ను బి జె వై ఎం సూర్యాపేట జిల్లా అధ్యక్షులు 46 వార్డు మున్సిపల్ కౌన్సిలర్ కట్కూరి కార్తీక్ రెడ్డి ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం చేస్తున్న పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలలోకి తీసుకుపోవాలని ఆయన అన్నారు కేంద్రం ఇస్తున్న నిధులతో రాష్ట్రంలో పలు అభివృద్ధి పనులు చేస్తూ రాష్ట్రంలో అధికారంలో ఉన్న టిఆర్ఎస్ పార్టీ బిజెపి పార్టీ పై విమర్శలు చేయడం సరియైన విధానం కాదని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు, కట్కూరి కపిల్ రెడ్డి, ఆ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి నకిరేకంటి వెంకన్న, బిజెవైఎం మండల అధ్యక్షులు శనగాని సతీష్, మండవ నాగార్జున, శివ, గోవిందు, జనార్ధన్, గోపాలకృష్ణ, తదితరులు పాల్గొన్నారు…