కేంద్రమంత్రిని బర్తరఫ్‌ చేయాలి

అజయ్‌ మిశ్రా ఓ క్రిమనల్‌ అన్న రాహుల్‌
పార్లమెంటులో గందరగోళంతో ఉభయసభలు వాయిదా
న్యూఢల్లీి,డిసెంబర్‌16 (జనం సాక్షి) : పార్లమెంట్‌ సమావేశాలు వాడి వేడిగా సాగుతున్నాయి.లఖింపూర్‌ ఖేరీ కేసు విచారణపై సిట్‌ ఇచ్చిన నివేదిక ఇప్పుడు పార్లమెంట్‌ లో హాట్‌ టాపిక్‌ గా మారింది. సిట్‌ ఇచ్చిన రిపోర్ట్‌ తో కాంగ్రెస్‌ పార్టీ అధికార పార్టీ బీజేపీపై విమర్శల దాడి పెంచింది. వెంటనే కేంద్ర మంత్రి అజయ్‌ మిశ్రను బర్తరఫ్‌ చేయాలని కాంగ్రెస్‌ పార్టీ డిమాండ్‌ చేస్తోంది. ఇదే విషయంపై ఇవాళ రాహుల్‌ గాంధీ లోక్‌ సభలో మాట్లాడారు. అజయ్‌ మిశ్ర ఓ క్రిమినల్‌ అంటూ ధ్వజమెత్తారు. అమాయక రైతు ప్రాణాల్ని బలితీసుకున్న కేంద్రమంత్రి అజయ్‌ మిశ్రను వెంటనే మంత్రివర్గం నుంచి తొలగించాలని రాహుల్‌ డిమాండ్‌ చేశారు. కేంద్ర మంత్రి అజయ్‌ మిశ్రాపై కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ మరోసారి విరుచుకు పడ్డారు. ఆయన ఓ క్రిమినల్‌ అని, ఆయన రాజీనామా చేయాలని లేదా ఆయనను మంత్రి పదవి నుంచి తొలగించాలని లోక్‌సభలో గురువారం డిమాండ్‌ చేశారు. అజయ్‌ మిశ్రా కుమారుడు ఆశిష్‌ మిశ్రా అక్టోబరు 3న ఉత్తర ప్రదేశ్‌లోని లఖింపూర్‌ ఖేరీలో జరిగిన హింసాకాండలో నిందితుడనే విషయం తెలిసిందే.
ఈ మంత్రిని మంత్రివర్గం నుంచి తొలగించాలి, ఆయన ఓ క్రిమినల్‌‘ అని అన్నారు. లఖింపూర్‌ ఖేరీ
హింసాకాండలో మిశ్రా ప్రమేయం ఉందన్నారు. రాహుల్‌ గాంధీ తన డిమాండ్‌ను కొనసాగిస్తుండగా, బీజేపీ ఎంపీలు లేచి నిల్చుని, నినాదాలు చేశారు. దీంతో సభను సభాపతి వాయిదా వేశారు. ఆయన బుధవారం కూడా ఇదే అంశాన్ని పార్లమెంటులో లేవనెత్తారు. అజయ్‌ మిశ్రాను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కాపాడుతున్నారని ఆరోపించారు. లఖింపూర్‌ ఖేరీ దుర్ఘటనపై సభలో చర్చ జరగాలని, ప్రభుత్వం సాకులు చెప్తోందని అన్నారు. అక్టోబరు 3న లఖింపూర్‌ ఖేరీలో జరిగిన హింసాకాండలో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో నలుగురు రైతులు. సాగు చట్టాలకు వ్యతిరేకంగా నిరసన తెలుపుతుండగా ఓ కారు వారిపై నుంచి దూసుకెళ్ళింది. ఈ కేసులో ఆశిష్‌ మిశ్రా సహా 13 మంది నిందితులు. వీరందరూ ఉద్దేశపూర్వకంగానే హింసకు పాల్పడ్డారని ప్రత్యేక దర్యాప్తు బృందం ఆరోపించింది. వీరిపై నమోదైన ఆరోపణలను సవరించి, వీరు హత్యాయత్నానికి పాల్పడినట్లు ఆరోపణలను నమోదు చేయాలని కోర్టును కోరింది. ఈ వ్యవహారంపై చర్చకు పట్టుబట్టడంతో సభలో గందరగోళం ఏర్పడిరది. ఓ వైపు ప్రతిపక్షాల విమర్శలు.. మరోవైపు అధికార పార్టీ వాగ్వాదాలతో లోక్‌ సభ అట్టుడికింది. రాహుల్‌ ప్రసంగాన్ని బీజేపీ అడ్డుకునే ప్రయత్నం చేసింది. సభలో గందరగోళం ఏర్పడటంతో స్పీకర్‌ లోక్‌ సభను మధ్యాహ్నం రెండు గంటలకు వాయిదా వేశారు. అటు రాజ్యసభ కూడా మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా పడిరది.