కేంద్ర మంత్రివర్గంలో కావూరి, వీహెచ్‌లకు చోటు?

ఢిల్లీ : కేంద్ర మంత్రి వర్గ పునర్‌ వ్యవస్థీకరణ వార్తలు రావడంతో కొత్తగా మంత్రివర్గంలో స్థానం పొందే అవకాశం ఉందంటూ పలువురి పేర్లు విన్పిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌ నుంచి కావూరి సాంబశివరావు, వి. హనుమంతరావు, నంది ఎల్లయ్య పేర్లు ప్రముఖంగా విన్పిస్తున్నట్లు సమాచారం. కేంద్రమంత్రివర్గంలో ఈసారి కొత్తగా 8మందికి స్థానం లభించనున్న నేపథ్యంలో రాష్ట్రం నుంచి కనీసం ముగ్గురికైనా చోటు దొరుకుతుందని భావిస్తున్నారు.