కేటీఆర్ వికారాబాద్ పర్యటన సందర్భంగా బీఎస్పీ బిజెపి కాంగ్రెస్ కార్యకర్తలు ముందస్తు అరెస్టులు

కేటీఆర్ వికారాబాద్ పర్యటన సందర్భంగా బీఎస్పీ బిజెపి కాంగ్రెస్ కార్యకర్తలు ముందస్తు అరెస్టులు

వికారాబాద్ రూరల్ అక్టోబర్ 5( జనం సాక్షి)
వికారాబాద్: మంత్రి కేటీఆర్ వికారాబాద్ పర్యటన సందర్భంగా ఎక్కడ ఆయన పర్యటనను అడ్డుకుంటారో అనే భయంతో ముందస్తుగా
ప్రభుత్వం పొలీస్ స్టేషన్లో అరెస్టులు చేయడం జరిగిందని బహుజన సమాజ్ పార్టీ వికారాబాద్ ఎమ్మెల్యే అభ్యర్థి జీ.క్రాంతి కుమార్ అన్నారు.వికారాబాద్ అభివృద్ధి శూన్యం.వికారాబాద్ రైల్వే బ్రిడ్జి 96కోట్లు నిర్మాణం చేయడానికామరమ్మత్తు చేస్తూ రాత్రి రాత్రి కే మరమ్మత్తులు చేసి వికారాబాద్ ప్రజలను మత్తు లో ముంచి మాయ చేయడానికా? కేటీఆర్ వస్తున్నరని రోడ్డు పనులు చేయడం కాదు,గత 40సంవత్సరాల నుండి హైదరాబాద్ వైపు వెళ్ళే రైల్వే బ్రిడ్జి పూర్తి కాలేదు.వికారాబాద్ లో దళిత బంధు ఎవరికి ఇస్తున్నారు. ఎంమ్మెల్యే అనుచరులకు తప్ప నియోజకవర్గం లో బుడగ జంగం వాళ్ళు దళితులు గా గుర్తింపు లేదా? అని ప్రశ్నించారు.డబుల్ బెడ్రూమ్ ఎవరికీ వచ్చినవి పిల్లర్స్ దగ్గరే ఆగినయి. 9 సంవత్సరాల నుండి ఎంత మందికి ఇచ్చిన్రు ఇప్పటివరకు ఎంతమందికి ఇచ్చినారు? లబ్ధిదారుల సంఖ్య తెలుపలేని పరిస్థితుల్లో మీరున్నరు.అలాంటప్పుడు వికారాబాద్ కు ఏ ముఖం పెట్టుకొని కేటీఆర్ వస్తున్నాడని బీఎస్పీ వికారాబాద్ ఎమ్మెల్యే అభ్యర్థి జి.క్రాంతీ కుమార్ తీవ్రంగా మండిపడ్డారు. ముందస్తు అరెస్టు చేసిన వారిలో బీజేవైఎం మండల అధ్యక్షుడు ఆషి రెడ్డి మండల పార్టీ అధ్యక్షుడు లక్ష్మారెడ్డి కాంగ్రెస్ మండల వర్కింగ్ జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కాంగ్రెస్ బీఎస్పీ బిజెపి పార్టీ నాయకులు తదితరులు ఉన్నారు