కేన్సర్‌ రోగులు పెరుగుతున్నారట!

c98o0b1rదేశంలో కేన్సర్‌ రోగుల సంఖ్య గణనీయంగా పెరుగుతోందని కేంద్రం ఆందోళన వ్యక్తం చేసింది. 2025 నాటికి దేశంలో కేన్సర్‌ రోగుల సంఖ్య 15 లక్షలు దాటుతుందని అంచనా వేసింది. 2014 లెక్కల కంటే ఇది 35 శాతం అధికమని ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా రాజ్యసభలో వెల్లడించారు. అనారోగ్య జీవన విధానం, పొగాకు ఉత్పత్తులను వినియోగించేవారికి కేన్సర్‌ వచ్చే అవకాశాలు అధికంగా ఉన్నాయన్నారు