కేన్స్‌లో దొంగల చేతివాటం

పారిస్‌ : కేస్స్‌లో మరోసారి దొంగలు చేతివాటం ప్రదర్శించారు. 80 మంది సెక్యూరిటీ గార్డుల కన్నుగప్పి రూ. 2.6 మిలియస్‌ డాలర్ల విలువ చేసే నెక్లెస్‌ను మాయం చేసేశారు. ఫ్రెంచ్‌ రివేరా  హోటల్‌లో జరిగిందీ సంఘటన. డె గ్రిసొగొనొ అభరణాల దుకాణం వారు చిత్రోత్సవానికి వచ్చిన అతిథుల కోసం ఏర్పాటు చేసిన పార్టీ అనంతరం నెక్లెస్‌ పోయినట్లు గుర్తించారు. గతవారం కూడా కేస్స్‌లో దొంగలు మిలియన్‌ డాలర్ల ఖరీదు చేసే నగలు దొంగిలించారు.