కేరళలో బర్డ్‌ఫ్లూ భయం

బాతులను చంపేస్తున్న ప్రజలు
కొట్టాయం,డిసెంబర్‌17(జనంసాక్షి):  బర్డ్‌ ఫ్లూ భయంతో కేరళలో పెద్ద ఎత్తున బాతులను చంపేస్తున్నారు. రాష్ట్రంలోని కొట్టాయం, అలప్పూజ జిల్లాల్లో బర్డ్‌ ఫ్లూ సోకినట్లు గుర్తించడంతో.. సామూహికంగా బాతులను చంపేస్తున్నారు. గురువారం ఒక్క రోజే 5,700 బాతులను చంపేసినట్లు స్టేట్‌
యానిమల్‌ హజ్బెండరీ శాఖ అధికారులు ప్రకటించారు. నిన్నటి వరకు మొత్తంగా 16,976 బాతులను చంపినట్లు చెప్పారు. అలప్పుజాలో రెండ్రోజుల్లో 15,665 బాతులను కిల్లింగ్‌ చేశారని.. మరో రెండు, మూడ్రోజుల పాటు ఈ పక్రియ కొనసాగుతుందని అధికారులు చెప్పారు. బర్డ్‌ ఫ్లూ భయాందోళనల నేపథ్యంలో గుడ్లు, మాంసం, బాతుల పేడ, చికెన్‌ కొనుగోళ్లపై స్థానిక పాలనా యంత్రాంగం నిషేధం విధించింది. ’బర్డ్‌ ఫ్లూ సోకిన బాతులను చంపడం లేదా కాల్చేస్తున్నాం. కల్లారా, వేచూర్‌ తోపాటు ఐమానంలో బర్డ్‌ ఫ్లూ ప్రభావం ఎక్కువగా ఉంది’ అని కొట్టాయం జిల్లా డిస్టిక్ట్‌ కలెక్టర్‌ పీకే జయశ్రీ తెలిపారు.