కేరళ కాంగ్రెస్‌ నేత మృతి

చెన్నై,నవంబర్‌21(జ‌నంసాక్షి): కేరళ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ (కేపీసీసీ) కార్యనిర్వాహక అధ్యక్షుడు ఎంఎల్‌ షానవాజ్‌ బుధవారంనాడు కన్నుమూశారు. ఆయన వయస్సు 67 సంవత్సరాలు. కాలేయం మార్పిడి

అనంతరం తలెత్తిన సమస్యల కారణంగా ఆయన కన్నుమూశారు. వయనాద్‌ నియోజకవర్గం ఎంపీ అయిన షానవాజ్‌ను ఇటీవల చెన్నైలోని ప్రైవేటు ఆసుపత్రిలో చేరారు. కొన్నేళ్ల క్రితం కేన్సర్‌ నుంచి బయటపడ్డారు. అయితే ఇటీవల కాలేయం వరకూ కేన్సర్‌ పాకింది. 1983 నుంచి కేరళ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ సభ్యుడిగా ఉన్న షానవాజ్‌… 2009, 2014లో లోక్‌సభకు ఎన్నికయ్యారు. కేరళలోని ఎర్నాకులంలో గురువారంనాడు ఆయన అంత్యక్రియలు జరుగనున్నాయి.