కేరళ మంత్రి మాథ్యూ రాజీనామా
తిరువనంతపురం,నవంబర్26(జనంసాక్షి): కేరళలో వామపక్ష మంత్రిమండలికి చెందిన నీటి వనరుల శాఖా మంత్రి మాథ్యూ టి. థామస్ తన పదవికి రాజీనామ చేశారు. సోమవారం రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయ్ విజయన్ నివాసానికి చేరుకున్న ఆయన తన రాజీనామాను అందించినట్లు వెల్లడించారు. రాష్ట్ర జెడి(ఎస్) అధ్యక్షుడు, చిత్తోర్ నియోజకవర్గంలోని పాలక్కడ్కు చెందిన కె. కృష్ణన్ కుట్టీని మాథ్యూస్ స్థానంలో నియమిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు జెడి(ఎస్) నాయకత్వం తీర్మానించిందని దీంతో తాను రాజీనామా చేసినట్లు మాథ్యూస్ వెల్లడించారు. కాగా, గవర్నర్ పళనిస్వామి సధాశివమ్ మంగళవారం రాజభవన్లో నిర్వహించే ఒక అధికారిక కార్యక్రమంలో కృష్ణన్కుట్టీతో ప్రమాణ స్వీకారం చేయించనున్నారు.