కైస్త్రవ మతప్రచారకుడు జాన్ మృతదేహం కోసం గాలింపు
తనకు చనిపోవాలని లేదంటూ ముందే పోస్ట్
చెన్నై,నవంబర్22(జనంసాక్షి): కైస్త్రవ మత ప్రచారం కోసం అండమాన్ నికోబార్లోని నార్త్ సెంటినల్ దీవికి వెల్లిన జాన్ అలెన్ అనే ఓ అమెరికా జాతీయుడు దారుణ హత్యకు గురైన ఘటనలో అతడి శవం కోసం గాలింపు చేప్టటారు. స్థానికుల సాయంతో బలగాలు అన్వేషణ చేపట్టాయి. అయితే బయటివారి ఉనికిని ఏమాత్రం ఇష్టపడని ‘సెంటినెలీస్’ తెగ వారు ఈ చర్యకు పాల్పడ్డారు. అయితే జాన్ అండమాన్, నికోబార్ దీవులకు వెళ్లడానికి ముందు తన ఇన్స్టాగ్రామ్లో పెట్టిన ఓ పోస్ట్ ఇప్పుడు అందరి హృదయాలను కలచి వేస్తోంది. ‘విూ అందరికీ నేను పిచ్చివాడిలా కనిపించొచ్చు. కానీ అండమాన్లోని సెంటినెలీస్ తెగకు చెందినవారికి జీసస్ గురించి బోధించడానికి ఇదే సరైన సమయం. దేవుడా.. నాకు చనిపోవాలని లేదు’ అంటూ జాన్ తన ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశారు. ఈ పోస్ట్ పెట్టిన తర్వాతే జాన్ అండమాన్ దీవులకు వెళ్లారు. గతంలో జాన్ ఐదుసార్లు అండమాన్, నికోబార్ దీవులను సందర్శించారు. జాన్ కైస్త్రవ మతబోధకుడు కావడంతో ఆ ఆదివాసీ తెగవారికి కూడా బోధనలు చేయాలని అనుకున్నారు. కానీ ఆ తెగ వారు బయటివారితో సంబంధాలను ఏమాత్రం ఇష్టపడరు. అందుకే జాన్పై బాణాలు వేసి చంపేశారు. అతడి మృతదేహాన్ని స్వాధీనం చేసుకోవడానికి ఇంకా ప్రయత్నాలు జరుగుతున్నాయి.జాన్ అలెన్ మృతి గురించి తెలిసిన అతని కుటుంబ సభ్యులు జాన్ ఇన్స్టాగ్రామ్లో ఓ మెసేజ్ని పోస్ట్ చేశారు. జాన్ అలెన్ ‘మరణించాడని మాకు తెలిసింది. అండమాన్, నికోబార్ దీవుల్లోని సెంటనెలీస్ తెగ ప్రజలు అతన్ని చంపారని చెపుతున్నారు. జాన్ మృతి మా కుటుంబానికి తీరని లోటు. ఈ విషాదం గురించి మేం మాటల్లో చెప్పలేం. తను మా ప్రియమైన కుమారుడు, సోదరుడు, స్నేహితుడు. తనో కైస్త్రవ మత ప్రచారకుడు, సాకర్ కోచ్, పర్వాతారోహకుడు కూడా. అతను దేవున్ని ప్రేమిస్తాడు.. అవసరమున్న వారికి సాయం చేయడంలో ముందుంటాడు. అతను సెంటినెలీస్ ప్రజలను కూడా అలానే ప్రేమించాడు. జాన్ మరణానికి కారణమైన వారిని మేము క్షమిస్తున్నామని తెలిపారు. అంతేకాక ‘జాన్ను ఆ ప్రాంతానికి తీసుకెళ్లడానికి సాయం చేసిన అతని మిత్రులను అరెస్ట్ చేసినట్లు మాకు తెలిసింది. వారిని కూడా వదిలిపెట్టాల్సిందిగా నా మనవి. తన ఇష్టప్రకారమే అక్కడికి వెళ్లాడు. అతని చర్యలకు వేరేవాళ్లని శిక్షించడం సరికాదు. కుటుంబ సభ్యులుగా విూరు మా మనవిని మన్నిస్తారని ఆశిస్తున్నామంటూ పోస్ట్ చేశారు.