కొండవీడుకు ఘనమైన చరత్ర ఉంది

ముగింపు ఉత్సవాల్లో చంద్రబాబు
గుంటూరు,ఫిబ్రవరి18(జ‌నంసాక్షి): కొండవీడుపై ఎన్నో సినిమాలు వచ్చాయని.. ఈ కోటకు ఘనమైన చరిత్ర ఉందని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. ఎన్టీఆర్‌ కొండవీటి సింహం చిత్రం కొండవీడు ప్రతిష్ఠను పెంచిదని ఆయన చెప్పారు. గుంటూరు జిల్లా యడ్లపాడు మండలం కొండవీడు ఉత్సవాల ముగింపు కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు. రూ.34 కోట్లతో నిర్మించిన కొండవీడు ఘాట్‌ రోడ్డును ప్రారంభించిన ఆయన.. అనంతరం నగర వనానికి శంకుస్థాపన చేశారు. కొండపైన పుట్టాలమ్మ, ముత్యాలమ్మ, వెదుళ్ల చెరువులు, కట్టడాలు, దేవాలయాలను పరిశీలించారు. ఈ సందర్భంగా కొండవీడు చరిత్రపై రూపొందించిన డాక్యుమెంటరీని సీఎం విడుదల చేశారు. కొండవీడు సామ్రాజ్య వైభవం, కైఫీయత్‌ పుస్తకాలను చంద్రబాబు ఆవిష్కరించారు.