కొత్త కాగ్‌ నియామకాన్ని తప్పుపట్టిన ఆమ్‌ ఆద్మీ పార్టీ

ఢిల్లీ, జనంసాక్షి: కొత్త కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌గా ప్రభుత్వం రక్షణ శాఖ మాజీ కార్యదర్శి శశికాంత్‌ శర్మను నియమించడాన్ని ఆమ్‌ఆద్మీపార్టీ తప్పుపట్టింది. కాగ్‌, సీవీసీ, సీఐసీ లాంటి కీలక సంస్థలకు వెన్నెముక లేని వ్యక్తుల్ని నియమించడం ద్వారా యూపీఏ ప్రభుత్వం ఆయా సంస్థలను నిర్వీర్యం చేసే ప్రయత్నం చేస్తోందని ఏఏపీ న్యాయవాది ప్రశాంత్‌ భూషన్‌ ఢిల్లీలో అన్నారు.