కొత్త కార్యవర్గాన్ని ప్రకటించిన ఏఐసీసీ

న్యూఢిల్లీ, (జనంసాక్షి): ఏఐసీసీ కొత్త కార్యవర్గాన్ని ప్రకటించింది. రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్‌గా దిగ్విజయ్‌సింగ్‌ను నియమించింది. ఈ కార్యవర్గంలో సీడబ్ల్యూసీ ప్రత్యేక ఆహ్వానితేడిగా ఐఎన్‌టీయూసీ అధ్యక్షుడు సంజీవ్‌రెడ్డి ఏఐసీసీ ప్రకటించింది. శాశ్వత ఆహ్వానితుడిగా కావూరి సాంబశివరావును నియమించింది. ఏఐసీసీ కార్యదర్శిగా జి. చిన్నారెడ్డి బాధ్యతలు చేపట్టారు.