కొనసాగుతున్న చమరు ధరల తగ్గింపు
న్యూఢిల్లీ,నవంబర్23(జనంసాక్షి): దేశీయంగా చమురు ధరల తగ్గింపు కొనసాగుతోంది. అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు తగ్గడం, డాలర్తో రూపాయి మారకం విలువ బలపడటంతో గత కొన్ని రోజులుగా పెట్రోల్, ధరలు దిగొస్తున్న విషయం తెలిసిందే. శుక్రవారం కూడా ఇంధన ధరలు మరికాస్త తగ్గాయి. దీంతో అక్టోబరు 18 నుంచి నవంబరు 23 వరకు పెట్రోల్ ధర రూ. 8.43 తగ్గడం విశేషం. దేశ రాజధానిలో శుక్రవారం పెట్రోల్పై 40 పైసలు తగ్గి లీటర్ ధర రూ. 75.57గా ఉంది. ఇక ధరలు అత్యధికంగా ఉండే ముంబయిలో లీటర్ పెట్రోల్ ధర రూ. 81.50, కోల్కతాలో రూ. 77.53, చెన్నైలో రూ. 78.46, హైదరాబాద్లో రూ. 80.12గా ఉంది. డీజిల్ కూడా నేడు రూ. 41పైసలు తగ్గి దిల్లీలో లీటర్ ధర రూ. 70.56గా ఉంది. ముంబయిలో రూ. 73.91, కోల్కతాలో రూ. 72.41, చెన్నైలో రూ. 74.55, హైదరాబాద్లో రూ. 76.77గా ఉంది. అక్టోబర్ 4న పెట్రోలు ధర రికార్డు స్థాయిలో దిల్లీలో లీటర్కు రూ.84కు చేరగా, ముంబయిలో రూ.91.34కు చేరింది. అదేరోజు డీజిల్ అత్యున్నతస్థాయిలో దిల్లీలో రూ.75.45, ముంబయిలో రూ.80.10కి చేరింది. ఆ తర్వాత అక్టోబరు 18 నుంచి చమురు ధరలు దిగొస్తున్నాయి.