కొనసాగుతున్న హైడ్రా దూకుడు

రాయదుర్గంలో ఆక్రమణల కూల్చివేత
హైదరాబాద్‌,ఆగస్ట్‌26 (జనం సాక్షి):  నగరంలో హైడ్రా కూల్చివేతలు ఆక్రమణదారుల గుండెల్లో దడ పుట్టిస్తున్నాయి. వరసగా కూల్చివేతలు చేస్తూ అక్రమార్కుల గుండెల్లో హైడ్రా నిద్రపోతోంది. పేద, ధనిక, సినిమా స్టార్లు, రాజకీయ నేతలు ఇలా ఎవరినీ వదిలిపెట్టకుండా కబ్జాలకు అడ్డుకట్ట వేస్తోంది. ప్రభుత్వ స్థలాన్ని అంగులం ఆక్రమించిన తీవ్రంగా స్పందిస్తోంది. తాజాగా శేరిలింగంపల్లి మండలం రాయదుర్గంలో ప్రభుత్వ భూముల్లో వెలిసిన అక్రమ నిర్మాణాలను హైడ్రా అధికారులు కూల్చివేశారు. రాయదుర్గం సర్వే నంబర్‌ 3, 4, 5, 72లోని ప్రభుత్వ స్థలాల్లో అక్రమంగా కట్టిన భవనాలను కూల్చివేస్తున్నారు. అయితే తమకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా చర్యలు చేపట్టారంటూ జీహెచ్‌ఎస్‌సీ టౌన్‌ ప్లానింగ్‌ అధికారులను స్థానికులు అడ్డుకున్నారు. తమ ఇళ్లను కూల్చవద్దంటూ ఆందోళనకు దిగారు. అధికారులతో స్థానికులు వాగ్వాదానికి దిగారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. అధికారుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి పోలీసులు భారీగా చేరుకున్నారు. పోలీసుల ఆధ్వర్యంలో కూల్చివేతల పర్వం సాగుతోంది. తెలంగాణ ప్రభుత్వ ఆస్తుల రక్షణ కోసం ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి హైడ్రా వ్యవస్థను తీసుకువచ్చారు. ప్రభుత్వ ఆస్తుల సంరక్షణెళి లక్ష్యంగా ఆ వ్యవస్థను ఏర్పాటు చేశారు. నగరంలో జనాభా పెరిగిపోతుండడంతో ఇష్టాను సారంగా చెరువులు, ప్రభుత్వ భూములు ఆక్రమించి నిర్మాణాలు చేపడుతున్నారు. సరైన పర్యవేక్షణ వ్యవస్థ లేకపోవడంతో ఇన్నాళ్లూ ఆక్రమణదారులు ఆడిరదే ఆటగా, పాడిరదే పాటగా సాగింది. హైడ్రా రావడంతో నగర పరిధిలో చర్యలు చేపడుతోంది. ఇటీవల సినీనటుడు నాగార్జునకు చెందిన మాదాపూర్‌లోని ఎన్‌ కన్వెన్షన్‌ను అధికారులు కూల్చివేశారు. కూల్చివేతలను అడ్డుకునేందుకు ఆయన హైకోర్టును సైతం ఆశ్రయించారు. అయితే ఈ లోపే అధికారులు దాన్ని నెలమట్టం చేశారు. మరోవైపు బీఆర్‌ఎస్‌ నేత, జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌ రెడ్డికి చెందిన అనురాగ్‌ యూనివర్శిటీపై కూడా ఆరోపణలు వచ్చాయి. అక్రమంగా భూములు కబ్జా చేసి నిర్మాణాలు చేశారంటూ ఆయనపై ఇప్పటికే పలు కేసులు నమోదు అయ్యాయి. మరోవైపు అధికార పార్టీ నేతలను సైతం హైడ్రా వదిలిపెట్టడం లేదు. ఇలా చిన్నా, పెద్ద తేడా లేకుండా హైడ్రా ఆక్రమణదారుల బెండు తీస్తోంది.