కొల్లం ప్రమాదంపై న్యాయవిచారణకు ఆదేశించిన ప్రభుత్వం

కొల్లాం: కొల్లంలోని పుట్టింగల్‌దేవి ఆలయంలో ఈరోజు తెల్లవారుజామున జరిగిన అగ్నిప్రమాద ఘటనపై కేరళ ప్రభుత్వం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ప్రమాదంపై కేరళ సీఎం వూమెన్‌చాందీ న్యాయ విచారణకు ఆదేశించారు. సహాయక చర్యలను పర్యవేక్షించాలని మంత్రులను ఆదేశించారు. ప్రమాదం జరిగిన విషయం తెలిసిన వెంటనే ముఖ్యమంత్రి, మంత్రులు ఘటనాస్థలికి బయలుదేరారు. బాదితులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని అధికారులను సీఎం ఆదేశించారు.