కోట్ల చేరికపై బాబుతో చర్చించలేదు: కెఇ

అమరావతి,జనవరి30(జ‌నంసాక్షి): కోట్ల సూర్యప్రకాష్‌ రెడ్డి కుటుంబం చేరిక అంశాన్ని చంద్రబాబు తన వద్ద ప్రస్తావించ లేదని ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి అన్నారు. శ్రీశైలం ట్రస్ట్‌ బోర్డ్‌ ఏర్పాటుపైనే తాము చర్చించామని తెలిపారు. కోట్ల చేరిక అంశాన్ని తాను సీఎం వద్ద ప్రస్తావించనని, చంద్రబాబు ప్రస్తావించినప్పుడే కోట్ల చేరికపై తన అభిప్రాయం చెబుతానని వెల్లడించారు. ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబుతో భేటీ అనంతరం ఆయన మాట్లాడారు. కోట్ల కుటుంబం ఏయే సీట్లు అడుగుతున్నారనే విషయం కూడా తనకు తెలీదని కేఈ చెప్పారు. కోట్ల పార్టీలో చేరుతారన్న తరవాత ఇప్పుడు ఈ వ్యవహారం హాట్‌ టాపిక్‌ అయ్యింది. సవిూకరణాలు మారడంతో పాటు కెఇ బ్రదర్స్‌ కొంత అయిష్టంగా ఉన్నట్లు సమాచారం.