కోల్‌కతాలో ఉద్రిక్తంగా మారిన ర్యాలీ

కోల్‌కతా, జనంసాక్షి: కోల్‌కతాలో ఇటీవల చోటుచేసుకున్న చిట్‌ఫండ్‌ కుంభకోణం నేపథ్యంలో ఈ రోజు చిట్‌ఫండ్‌ సంస్థలకు వ్యతిరేకంగా డెమొక్రటిక్‌ స్టూడెంట్స్‌ ఆర్గనైజేషన్‌ ఆధ్వర్యంలో ఒక ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో పాల్గొంటున్నవారిని చెదరగొట్టడానికి పోలీసులు లాఠీఛార్జీ చేయగా ప్రదర్శన ఉద్రిక్తంగా మారింది. పలువురికి గాయాలైనట్లు సమాచారం.