కోల్‌కతా లక్ష్యం 171 పరుగులు

రాంచి, జనంసాక్షి: కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్‌ చేసిన వారియర్స్‌ 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 170 పరుగులు చేసింది. గంభీర్‌ సేన ముందు 171 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. మనీష్‌ పాండే 66, ఫించ్‌ 48. ఊతప్ప 25, యువరాజ్‌ 30 పరుగులు చేశారు. కోల్‌కతా బౌలర్లలో బాలాజీ, సేన నాయకే, కలిస్‌ తలో వికెట్‌ తీశారు.