క్యూబా రోడ్డు ప్రమాదం: 13 మంది దుర్మరణం

, హైదరాబాద్‌: క్యూబా ప్రావిన్స్‌లోని కమాగ్వేలో జరిగిన రోడ్డు ప్రమాదంలో 13 మంది దుర్మరణం పాలయ్యారు. మరో 20 మందికి తీవ్రగాయాలయ్యాయి. స్థానిక కమాగ్వే-సాంటా క్రూజ్‌ దెల్‌ సర్‌ రహదారిపై వెళ్తున్న ట్రక్కు అదుపుతప్పి బోల్తాపడింది. దీంతో 13 మంది అక్కడికక్కడే మృతిచెందారు. క్షతగాత్రుల్ని స్థానిక ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. క్యూబా ప్రావిన్స్‌లో ప్రయాణికులకు సరిపడా బస్సుల సౌకర్యం లేకపోవడంతో ఎక్కువమంది ట్రక్కులను ఆశ్రయిస్తుంటారు. దీంతో అక్కడి శివారు ప్రాంతాలు ప్రమాదాలకు వేదికలవుతున్నాయి. గత ఆరునెలల్లో దాదాపు 5,300 రోడ్డు ప్రమాదాలు సంభవించినట్లు అక్కడి అధికారిక గణంకాలు చెబుతున్నాయి.