క్రీడలతో మానసికోల్లాసం ..

యాదాధ్రి జిల్లా తుర్కపల్లి మండలం జనం సాక్షి న్యూస్ ఫిబ్రవరి 15

క్రీడలు ఎంతో అవసరం క్రీడలతో మానసికోల్లాసం కలుగుతుందని ఉమ్మడి నల్గొండ జిల్లా డీసీసీబీచైర్మెన్‌ గొంగిడి మహేందర్‌రెడ్డి అన్నారు .బుధవారం మండలంలోని తుర్కపల్లి గ్రామ శివారులో గ్రామంలో  మాజీ ఎంపీటీసీ తలారి శ్రీనువాస్ ఆధ్వర్యంలో   క్రికెట్ టోర్నమెంట్ ఆయన  ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వం అన్ని రంగాల్లోనూ అభివృద్ధి సాధిస్తుందని దానిలో భాగంగానే గ్రామంలో క్రీడారంగాన్ని అభివృద్ధి చేసే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. క్రీడల వల్ల యువతలో  స్ఫూర్తి నింపుతూ శారీర దాడుర్యం పెంపొందించుటకు ఉపయోగపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ బికు నాయక్, ఎంపీపీ భూక్య సుశీల రవీందర్ నాయక్, సింగిల్ విండో చైర్మన్ సింగిరెడ్డి నరసింహారెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు పిన్నపురెడ్డి నరేందర్ రెడ్డి, టిఆర్ఎస్ యువ నేత గట్టు తేజస్వి నిఖిల్, సర్పంచులు పోగుల ఆంజనేయులు, సత్యనారాయణ, వెన్ను కుర్చీ రామ్మోహన్ శర్మ, సురేష్, ఎస్సై రాఘవేందర్ గౌడ్, ఎంపీటీసీ గిద్దె కరుణాకర్, కో ఆప్షన్ రైహామత్ షరీఫ్, యువత క్రీడాకారులు పాల్గొన్నారు