ఖని ప్రభుత్వ ఆసుపత్రిలో రోగుల సహాయకులకు అల్పాహార  పంపిణీఖని ప్రభుత్వ ఆసుపత్రిలో రోగుల సహాయకులకు అల్పాహార  పంపిణీ

యైటీంక్లయిన్ కాలని ఫిబ్రవరి 16 (జనం సాక్షి) :
శ్రీ సత్యసాయి సేవా సమితి 8వ కాలని సభ్యులచే గోదావరిఖని ప్రభుత్వ ఆసుపత్రిలో రోగుల సహాయకులకు ప్రతీ నెలా  మహిళా డే సందర్భముగా  అల్పాహారం పంపిణీ చేయడం జరుగుతుంది. అందులో బాగముగా గురువారం సుమారు 120 మందికి అల్పాహార  పంపిణీ చేయటం జరిగిందని సాయి కమిటీ సభ్యులు తెలిపారు.ఈ కార్యక్రమంలో శ్రీ సత్యసాయి సేవా సమితి సభ్యులు సుబ్బారావు, నూక రమేష్, లక్ష్మీ నారాయణ, మహిళా సభ్యులు పాల్గొన్నారు.