గగన్ పహాడ్ లో గణేష్ మండపానికి భూమి పూజ*

భారత్ యూత్ క్లబ్ ఆధ్వర్యంలో మండపం నిర్మాణం*
*రాజేంద్రనగర్. ఆర్.సి (జనం సాక్షి)* రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ సర్కిల్ మైలార్దేవుపల్లి డివిజన్ పరిధిలోని గగన్ పహాడ్ లో భారత్ యూత్ క్లబ్ ఆధ్వర్యంలో గణేష్ మండపం నిర్మాణానికి భూమి పూజ చేసిన యువజన సంఘం నాయకులు.
ఈ సందర్భంగా యూత్ క్లబ్ నాయకులు మాట్లాడుతూ ప్రతి ఏడు గణేష్ పండగ రోజు వినాయకుని ప్రతిష్టాపన చేయడానికి, మండపం లేక ఎండకు, వర్షానికి ఇబ్బందిగా ఉండేదని దాన్ని దృష్టిలో ఉంచుకొని యూత్ క్లబ్ ఆధ్వర్యంలో శాశ్వత గణేష్ మండపాన్ని నిర్మిస్తున్నామన్నారు. దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో జె. శ్రీనివాస్, రవి, యాదయ్య, అశోక్, శ్రీరాములు, నర్సింగ్ రావు, ధనుంజయ్, నగేష్, లక్ష్మణ్, పాండు, రాజ్ కుమార్, శేఖర్, శివ, శ్రీనివాస్, సదానందు, విక్రమ్, నరేందర్, ప్రేమ్, మధు, దయానంద్, వినయ్, కిరణ్, ఉదయ్, ప్రవీణ్, రవికిరణ్ తదితరులు పాల్గొన్నారు.
ఫోటో రైటప్ : గణేష్ మండపానికి భూమి పూజ చేస్తున్న యువజన సంఘం నాయకులు.