గడ్కరీకి ఆదాయపన్ను శాఖ గండం

ముంబయి : భారతీయ జనతాపార్టీకి రెండోసారి అధ్యక్షుడిగా ఎన్నిక కానున్న తరుణంలో నితిన్‌ గడ్కరీకి ఆదాయపు పన్ను శాఖ గండం దాపురించింది. బుధవారం ఆయన పార్టీ అధ్యక్షుడిగా రెండోసారి ఎన్నిక కావలసివున్న విషయం తెలిసిందే. ఈరోజు ముంబయిలోని ఆదాయపన్ను అధికారులు గడ్కరీకి చెందిన పూర్తి గ్రూప్‌ కంపెనీలో నిధులు పెడుతున్న ఏడు కంపెనీలపై విచారణ జరుపుతున్నారు. ముంబయిలో విచారణ పూర్తికాగానే నాగపూర్‌లో విచారణ కొనసాగునుంది. ఇప్పటికే అవినీతి ఆరోపణలు, పార్టీలోనే కొందరి అసంతృప్తి లాంటి సమస్యలు ఎదుర్కొంటున్న గడ్కరీకి ఐటీ విచారణ మరో తలనోస్సిగా మారింది.