గణేష్ నిమజ్జనం, మొహరం పండుగలపై సమీక్ష

హైదరాబాద్ : నగరంలోని విశ్వేశ్వరయ్య భవన్‌లో పోలీసు ఉన్నతాధికారులతో పోలీసు కమిషనర్ అంజనీ కుమార్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి అదనపు సీపీలు, డీసీపీలు, ఏసీపీలు, ట్రాఫిక్ పోలీసులు హాజరయ్యారు. ఈ సందర్భంగా గణేష్ నిమజ్జనం, మొహరం పండుగల నేపథ్యంలో చేపట్టాల్సిన చర్యలపై అంజనీ కుమార్ చర్చించి దిశానిర్దేశం చేశారు. నగరంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసు అధికారులకు సూచించారు. నగర ప్రజలు కూడా పోలీసులకు సహకరించాలని కోరారు.

తాజావార్తలు