గల్లంతైన వారి సమాచారం లేదు: గోయల్‌

ఢిల్లీ,(జనంసాక్షి): ఉత్తరాఖండ్‌ ఇంకా 1000 మంది తెలుగు యాత్రికులున్నారని ఏపీ భవన్‌ రెసిడెంట్‌ కమిషనర్‌ శశాంక్‌ గోయల్‌ చెప్పారు. ఇప్పటివరకు 1500 మందిని రక్షించి స్వస్థలాలకు పంపించినట్లు తెలిపారు. గల్లంతైన వారి నిర్ధిష్ట సమాచారం లేదన్నారు. ఉత్తరాఖండ్‌ యంత్రాంగమే వారి వివరాలు చెప్పాల్సి ఉందన్నారు. యాత్రికులను మోసంచేసిన ఆంజనేయ ట్రావెల్స్‌పై చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు.