గవర్నర్‌ను కలవనున్న నితీష్‌

ఢిల్లీ,(జనంసాక్షి): బీహార్‌ ముఖ్యమంత్రి నితీష్‌ కుమార్‌ ఆ రాష్ట్ర గవర్నర్‌ డీ. వై పాటిల్‌ను కలవనున్నారు. బీజేపీతో తెగదెంపుల నేపథ్యంలో రాష్ట్రంలో చోటుచేసుకుంటున్న పరిణామాల్ని నితీష్‌ గవర్నర్‌కు వివరిస్తారని సమాచారం. బీహార్‌ మంత్రివర్గాన్ని రద్దు చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు. బీహార్‌ అసెంబ్లీలో జేడీయూకు 118 మంది సభ్యులున్నారు. మరో ఐదుగురు ఇండిపెండెట్ల మదదతు ప్రభుత్వానాకా ఉందని ఎడియు వర్గాలు అంటున్నాయి. నితీష్‌ నిర్వహించిన కేబినేట్‌ సమావేశానికి బీజేపీ మంత్రులంతా గైర్హాజయ్యారు. మరోవైపు బీహార్‌ బీజేపీ నేేతలు పార్టీ జాతీయ అధ్యక్షుడు రాజ్‌నాథ్‌ సింగ్‌తో సమావేశమయ్యారు.