గాజులపల్లి లో డ్రై డే కార్యక్రమం.

గాజులపల్లి లో డ్రై డే కార్యక్రమం.

దౌల్తాబాద్ సెప్టెంబర్ 29, జనం సాక్షి.స్వచ్ఛ భారత్ మిషన్ (గ్రామీణ) లో భాగంగా స్వచ్ఛతా హి సేవ -2023 కార్యక్రమంలో భాగంగా మండల పరిధిలో గాజులపల్లి గ్రామంలో గ్రామ సర్పంచ్ అప్పవారి శ్రీనివాస్ ఆధ్వర్యంలో డ్రై డే,ఫ్రైడే కార్యక్రమం నిర్వహించారు. ఇంటి వద్ద ఉన్న డ్రమ్ములలో, గోలెములలో ఉన్న మురికి నీరును తొలగించారు. ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వార్డ్ సభ్యులు రమణ,పంచాయతీ కార్యదర్శి హంసకేతన్,అంగన్వాడి టీచర్ సరోజన, ఏఎన్ఎం విజయ తదితరులు పాల్గొన్నారు.