గుంజేడు గులాబీమయం…

గుంజేడు గులాబీమయం…

కొత్తగూడ జనంసాక్షి:మహబూబాబాద్ జిల్లా కొత్తగూడెం మండలంలోని గుంజేడు గ్రామం గులాబీమయం….రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకు ఆకర్షితులై గుంజేడు గ్రామంలోని ఇతరపార్టీల నుండి భారీ చేరికలు…పార్టీ కార్యాలయంలో గుంజేడు సర్పంచ్ అజ్మీరా రజిత రమేష్ మాట్లాడుతూ కేసీఆర్ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలకు ఆకర్షితులై భారీగా గత వారం రోజుల నుండి బి ఆర్ ఎస్ పార్టీ లో వరుసగా చేరికలు జరిగాయని అన్నారు.చేరికల్లో భాగంగా శనివారం రోజున కొత్తగూడ మండల కేంద్రంలో మండల బి ఆర్ ఎస్ పార్టీ కార్యాలయం లో గుంజేడు సర్పంచ్ అజ్మీర రజిత రమేష్ ఆధ్వర్యంలో బిఆర్ఎస్ అధికార ప్రతినిధి బానోత్ నెహ్రు నాయక్ చేతుల మీదగా బి ఆర్ ఎస్ పార్టీ కండువా కప్పి పార్టీ లోకి ఆహ్వానించడం జరిగింది.అనంతరం అధికార ప్రతినిధి నెహ్రూ మాట్లాడుతూ పార్టీ కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకోవడం జరుగుతుందని అన్నారు.ఈ కార్యక్రమంలో గూగులోత్ సురేష్ నాయక్ ములుగు జిల్లా యువజన కార్యదర్శి (మాసంపల్లి ఉపసర్పంచ్),గుంజేడు ఉపసర్పంచ్ శ్రీను,రామన్నగూడెం సర్పంచ్ సుగుణ కిషన్,బానోత్ అశోక్ బిఆర్ఎస్ పార్టీ యువ నాయకులు,శ్రీరాములు,ఇమ్రాన్,సిరిగిరి సురేష్,కొత్తగూడ ఉప సర్పంచ్ ఈసం నరేష్,క్రాంతి,పశువుల గట్టయ్య,అజ్మీర రాజన్న,భానోత్ నరేష్,మోహన్ టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు