గురునాథ్‌ చెన్నై సూపర్‌కింగ్స్‌ యజమాని కాదు : ఇండియా సిమెంట్స్‌

ఢిల్లీ, జనంసాక్షి: చెన్నై సూపర్‌కింగ్స్‌ ఫ్రాంఛైజీతో గురునాథ్‌ మీయప్పన్‌కు సంబంధం లేదని ఇండియా సిమెంట్స్‌ కంపెనీ ప్రకటించింది. గురునాథ్‌ చెన్నై సూపర్‌కింగ్స్‌ యాజమాని కానీ సీఈవో కాదని ఇండియా సిమెంట్స్‌ ప్రకటించింది. స్పాట్‌ ఫిక్సింగ్‌ కేసు దర్యాప్తులో బీసీసీఐ ,అధికారులకు సహకరిస్తామని ఇండియా సిమెంట్స్‌ ఒక ప్రకటనలో పేర్కొంది.